News November 19, 2025
సొంత జిల్లాలోనే పరీక్షలు నిర్వహించాలి: టెట్ అభ్యర్థులు

గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు జగిత్యాల జిల్లా టెట్ అభ్యర్థులకు కరీంనగర్లోనే సెంటర్ ఉండేది. మరి ఇప్పుడు సొంత జిల్లాలో కాకుండా ఖమ్మం, కొత్తగూడెం వంటి దూరప్రాంతాల్లో సెంటర్ పడటంతో అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల మూడు సెంటర్లు ఉండగా ఎక్కడో ఖమ్మంలో వేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు దీనిపై ఆలోచించాలని వారు కోరుతున్నారు.
Similar News
News January 16, 2026
పాల్వంచ: కొత్త అల్లుడికి ‘271’ వంటకాలతో విందు

కొత్త అల్లుడిపై అత్తమామలు తమ మమకారాన్ని వినూత్నంగా చాటుకున్నారు. సంక్రాంతి సందర్భంగా పాల్వంచలోని హైస్కూల్ రోడ్డుకు చెందిన గర్రె శ్రీనివాసరావు-పారిజాతం దంపతులు తమ అల్లుడు దత్త రామకృష్ణ, కుమార్తె ప్రణీతలకు ఏకంగా 271 రకాల పిండి వంటలు, స్వీట్లతో భారీ విందు ఏర్పాటు చేశారు. ఆంధ్ర సంప్రదాయాన్ని తలపించేలా తెలంగాణలోనూ ఇంత పెద్ద ఎత్తున వంటకాలు సిద్ధం చేయడంతో ఈ విందు స్థానికంగా చర్చనీయాంశమైంది.
News January 16, 2026
కాకినాడ: ‘కుక్కుట శాస్త్రం’ చెప్పిందే నిజమవుతోందా?

జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందేల్లో ‘కుక్కుట శాస్త్రం'(కోడి పురాణం) కీలకంగా మారింది. ఏ సమయంలో ఏ రంగు కోడి గెలుస్తుందో శాస్త్రంలో చెప్పినట్లే ఫలితాలు వస్తుండటంతో పందెంరాయుళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ఇష్టారాజ్యంగా పందేలు కాస్తున్నా, భారీగా బెట్టింగులు కట్టే వారు మాత్రం నక్షత్ర బలం, తిథి చూసుకొని బరిలోకి దిగుతున్నారు. దీనికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ పెరిగింది.
News January 16, 2026
HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT


