News February 4, 2025
సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే షాజహాన్ సంచలన వ్యాఖ్యలు

మదనపల్లె నియోజకవర్గంలో TDPని గెలవనివ్వకుండా చేస్తున్నది స్థానిక టీడీపీ నేతలేనని అ పార్టీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీడీపీలో టికెట్ వాళ్లకు కాకుండా వేరేవాళ్లకు వస్తే వారిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తారన్నారు. గత 20 ఏళ్లుగా 4 పర్యాయాలు మదనపల్లెలో టీడీపీ ఓటమికి ఆ పార్టీ నేతలే కారణమన్నారు. టికెట్ వచ్చేంత వరకు ఒకలా, వచ్చాక వేరేలా ఉంటారన్నారు.
Similar News
News February 13, 2025
MDK: బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి 3ఏళ్ల జైలు

కోహిర్ మండలంలో 2021 ఫిబ్రవరిలో 17ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు బేగరి ఆంజనేయులకు పోక్సో కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు అనంతరం చార్జ్షీట్ దాఖలు చేశారు. పోక్సో జడ్జి కే.జయంతి నిందితుడిని దోషిగా తేల్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన పలువురిని ఎస్పీ అభినందించారు.
News February 13, 2025
అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
News February 13, 2025
అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

అడ్డాకుల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. వనపర్తి మండలం కిష్టగిరికి చెందన రవీందర్(32) అడ్డాకులలో ఉంటున్నాడు. పెంట్లవెళ్లికి చెందిన షాతో కలిసి రవీందర్ నిన్న రాత్రి బైక్పై శాఖాపూర్ వైపు నుంచి అడ్డాకులకు వెళ్తున్నారు. హైవేపై కాటవరం స్టేజీ వద్ద జేసీబీని ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రవీందర్ అక్కడే మృతిచెందగా షాను జిల్లా ఆస్పత్రికి తరలించారు.