News April 26, 2024
సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్ కోఆర్డినేటర్లు

హైదరాబాద్ నగరంలో TPCC సోషల్ మీడియా ఛైర్మెన్ మన్నే సతీష్, TPCC సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ నిర్వహించిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ మీడియా, జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు అరుణ్, దేవిదాస్, సాయన్న, శివ, సుమన్, రాజు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2026
నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
News April 16, 2026
నిజామాబాద్: కీటక జనిత వ్యాధులపై నిఘా పెంచాలి – డీఎంహెచ్ఓ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మలేరియా, డెంగ్యూ వంటి కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో RDT పరీక్షలు పెంచాలని, వివరాలను IHIP పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
News April 16, 2026
తెలంగాణ వర్సిటీ పాలక మండలి సభ్యుడిగా దండు స్వామి

డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ దండు స్వామిని తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన ప్రస్తుతం గిరిరాజ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఇంగ్లీష్ విభాగం హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దండు స్వామి నియామకం పట్ల బర్దిపూర్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


