News November 19, 2025
హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ చీరలు

జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ‘యూనిఫామ్’ పేరుతో నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రభుత్వం పోచంపల్లి చీరలు (ఒక్కోటి రూ. 800) అందించనుంది. పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News January 16, 2026
బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్ను సీఎం ప్రారంభించారు.
News January 16, 2026
రేపు మహబూబ్నగర్లో ట్రాఫిక్ మళ్లింపులు

పాలమూరు జిల్లాకు రేపు సీఎం ఏ.రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో శనివారం ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని జిల్లా పోలీసులు తెలిపారు. పిస్తా హౌస్ బైపాస్ నుంచి రాయచూర్ రోడ్డు, భూత్పూర్ నుంచి మహబూబ్నగర్, పీయూ కాలేజ్ కొత్త బైపాస్ నుంచి పిస్తా హౌస్ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలను పాటించి, పోలీసులకు సహకరించాలని కోరారు.
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <


