News August 12, 2025

హనుమకొండ పరిధిలో 43 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

image

హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 43కు పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి తెలిపారు. సోమవారం చేపట్టిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 40 మందితో పాటు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో ముగ్గురికి కోర్టు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకుంటే జరిమానా తప్పదని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.

Similar News

News March 14, 2026

ADB: వంటింట్లో యుద్ధ సెగలు

image

చమురు, గ్యాస్ ధరల సెగ వంటింటిపై పడుతోంది. వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లు చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. అధికారికంగా రూ.60 పెరిగి సిలిండర్ ధర రూ.920 కాగా, బ్లాక్ మార్కెట్లో రూ.1100 వరకు ఉంది. ADBలో 282.2, ASFలో 190.0, MNCLలో 345.2, నిర్మల్‌లో 269.3 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఇదే అదునుగా వ్యాపారులు సిలిండర్‌పై రూ.150 నుంచి రూ.200 వరకు అదనంగా దండుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

News March 14, 2026

9వ తరగతి నుంచే ‘పదో తరగతి’కి సన్నద్ధం: కలెక్టర్

image

వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ బాలాజీ వినూత్న కార్యాచరణ ప్రకటించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇప్పుడే 10వ తరగతి సిలబస్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. 2027 SSC పరీక్షల కోసం వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 14, 2026

1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం: శ్రీకాకుళం కలెక్టర్

image

జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షలు 1,13,102 మంది మార్చి 15వ తేదీన రాయనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యాసకులకు అన్ని మండల, మున్సిపాలిటీ, గ్రామ వార్డుల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో 1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.