News August 12, 2025

హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములు కావాలి: నంద్యాల కలెక్టర్

image

79వ స్వాతంత్ర దినోత్సవంలో జాతీయ సమైక్యతకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులకు కార్యక్రమ నిర్వహణకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను త్రివర్ణ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.

Similar News

News March 17, 2026

మెట్రోలో గలీజ్ దందా.. పాత సామాన్లకే కొత్త రంగులేసి

image

METRO కోచ్‌ల మెయింటెనెన్స్ పేరుతో జరుగుతోన్న కొనుగోళ్లు, విదేశాల పార్టులు తెస్తున్నామని లోకల్‌ షెల్ కంపెనీల నుంచి పనికిరాని సామాన్లు కొంటున్నారు. మార్కెట్ రేట్ కంటే 40% అదనంగా బిల్లులేసి ట్యాక్స్ డబ్బుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పాతసామాన్లకే కొత్తరంగు పూసి ఇన్వెంటరీలో చూపిస్తున్నట్లు క్షేత్రస్థాయి ఆధారాలు చెబుతున్నాయి. పైఅధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోన్నట్లు ఉప్పల్, మియాపూర్ డిపోలలో టాక్.

News March 17, 2026

వరంగల్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో ‘మ్యానువల్’ దోపిడీ!

image

వరంగల్ రైల్వే స్టేషన్ వాహనాల పార్కింగ్ కేంద్రంగా భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా వాహనదారులకు కంప్యూటర్ బిల్లులకు బదులు మ్యానువల్ బిల్లులు ఇస్తూ జీఎస్టీ వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంప్యూటర్ బిల్లుల్లో జీఎస్టీ కలిపి ఇస్తేనే అది ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. అయితే, మ్యానువల్ బిల్లుల ద్వారా వసూలు చేస్తున్న ఈ సొమ్ము పక్కదారి పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

News March 17, 2026

జగిత్యాల: కలిసి పని చేస్తామన్న ఎమ్మెల్యే.. సాధ్యమేనా?

image

జగిత్యాల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చలు కొనసాగుతుండగా, స్థానిక MLA స్పందన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే చెప్పినా, ఇరువురి మధ్య గతంలో ఉన్న విభేదాలు, వర్గపోరు నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు జీవన్ రెడ్డి పార్టీ మారేందుకు సన్నద్ధమయ్యారు.