News August 20, 2025
హిందూపురం వచ్చే.. వందే భారత్ రైలు ఆగే..!

యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్లే వందే భారత్ రైలు హిందూపురంలో ఆగేందుకు రైల్వే ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైలు ఇంతకు ముందు యశ్వంతపూర్ నుంచి ధర్మవరం మీదుగా కాచిగూడ వెళ్లేది. హిందూపురం ప్రజల కోరిక మేరకు ఎంపీ బీకే పార్థసారది రైల్వే శాఖ మంత్రి సోమన్నను కలిసి హిందూపురంలో రైలు ఆగేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో మంగళవారం నుంచి వందే భారత్ రైలు హిందూపురంలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
Similar News
News January 19, 2026
మా ఆట నిరాశపరిచింది: గిల్

న్యూజిలాండ్తో మూడో వన్డేలో తాము ఆడిన విధానం నిరాశపరిచిందని భారత కెప్టెన్ గిల్ అన్నారు. ‘మేం కొన్ని విషయాలను సరిచేసుకోవాలి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న తీరు మాకు సానుకూల అంశం. 8వ స్థానంలో వచ్చి హర్షిత్లా ఆడటం అంత సులభం కాదు. వచ్చే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని నితీశ్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎలాంటి కాంబినేషన్స్ పని చేస్తాయో చూడాలి’ అని <<18892634>>మ్యాచ్ అనంతరం<<>> చెప్పారు.
News January 19, 2026
UPI ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. ఎంత తీసుకోవచ్చంటే?

ఏప్రిల్ నుంచి UPI ద్వారా PF సొమ్మును సభ్యులు విత్ డ్రా చేసుకునేందుకు EPFO ఏర్పాట్లు చేస్తోంది. ట్రాన్సాక్షన్కు గరిష్ఠంగా రూ.25 వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తోంది. విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్, మినిమమ్ బ్యాలెన్స్(25%)ను విడిగా చూపిస్తుందని సమాచారం. దీనిపై EPFO, C-DAC, NPCI మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా BHIM యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుందని చెప్పారు.
News January 19, 2026
జగిత్యాల జిల్లాలో 6వ రోజు తనిఖీలు

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బ్రీత్ అనలైజర్లతో వాహనదారులను పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేయడమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు హెచ్చరించారు.


