News December 3, 2025
హుస్నాబాద్: రూ.262.38 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో రూ.262.38 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్కు రూ.44.12 కోట్లు, R&Bకి రూ.58.91 కోట్లు, ట్రాన్స్ పోర్ట్కు రూ.8.5 కోట్లు, ఐటీఐకి రూ.45.15 కోట్లు, R&Bకి రూ.86 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: బోధన్ మున్సిపాలిటీలో హంగ్

ఉత్కంఠభరితంగా సాగిన బోధన్ మున్సిపాలిటీ కౌంటింగ్లో చివరకు హంగ్ ఏర్పడింది. మొత్తం 38 వార్డుల్లో 17 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేయగా 12 స్థానాల్లో MIM, BJP 3, BRS 5 స్థానాల్లో గెలిచాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 20కి ఎవరూ చేరుకోకపోవడంతో హంగ్ నెలకొంది.
News February 13, 2026
మున్సిపల్ పోరు: రెండో రౌండ్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..!

నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. భైంసాలో ఎంఐఎం, స్వతంత్రులు ఆధిపత్యం చాటుతూ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తుండగా.. నిర్మల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘నువ్వా-నేనా’ అన్నట్లు హోరాహోరీ సాగుతోంది. మొదటి రౌండ్ ముగిసేసరికి ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో అందరి కళ్లు రెండో రౌండ్ ఫలితాలపైనే ఉన్నాయి. తుది ఫలితాలు ఎవరి తలరాతను మారుస్తాయో వేచి చూడాలి.
News February 13, 2026
హైకోర్టులో పేర్ని నానికి చుక్కెదురు.!

మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో చుక్కెదురైంది. సీఎం, డిప్యూటీ సీఎంలను దూషించారంటూ మచిలీపట్నం ఇనగుదురు పీఎస్లో నానిపై నమోదైన కేసులో పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నమోదైన సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించినవి కావడంతో క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది.


