News November 14, 2025

అమలాపురం: నాచు తయారీపై పైలెట్ ప్రాజెక్టు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానం, పల్లం గ్రామాల్లో సముద్రపు నాచు తయారీ పైలట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రకటించారు. తన =కార్యాలయంలో సంబంధిత అధికారులతో శుక్రవారం చర్చించారు. సముద్రపు నాచు తయారీకి 16 మంది డ్వాక్రా మహిళలు, ఆర్నమెంట్ చేపల పెంపకానికి 21మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.

Similar News

News November 14, 2025

గద్వాల్: దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

image

భూభారతి, సాదాబైనామా, తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల సందర్భంగా 6391 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

News November 14, 2025

కోనసీమ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలుశిక్ష

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జైలుశిక్ష పడింది. కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా వివరాల మేరకు.. అయినవిల్లి లంకకు చెందిన ముత్తబత్తుల సతీశ్ 2018 ఆగస్ట్ 7న 15 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. నేరం నిరూపణ కావడంతో సతీశ్‌కు 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు జడ్జి K.శ్రీదేవి తీర్పు చెప్పారు.

News November 14, 2025

పదో తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులతో ఆమె సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అధ్యయన పద్ధతులు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై కలెక్టర్ మార్గదర్శకాలు ఇచ్చారు.