News February 27, 2025

కడెంలో అక్రమంగా తరలిస్తున్న టేకు ఫర్నీచర్ పట్టివేత!

image

అక్రమంగా తరలిస్తున్న ఫర్నీచర్ వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కడెం మండలంలోని గంగాపూర్ నుంచి ట్రాక్టర్ వాహనంలో వడ్ల సంచులు నింపుకొని లోపలి భాగంలో టేకు ఫర్నీచర్ సోఫాసెట్, బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్ను ఉంచి తరలిస్తున్నారన్న పక్క సమాచారం మేరకు సెక్షన్ అధికారి కింగ్ ఫిషర్ పట్టుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News February 27, 2025

సత్యసాయి: రోడ్డు ప్రమాదంలో ఒకరి స్పాట్ డెడ్

image

శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల పరిధిలోని పెద్దనపల్లి క్రాస్‌లో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చాకలి ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడి తమ్ముడికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పెద్దనపల్లి గ్రామంలోని అతని తండ్రి నాగరాజుతో పాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.

News February 27, 2025

ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

News February 27, 2025

ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

error: Content is protected !!