News November 14, 2025

కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే మృతి

image

బేతంచెర్ల మండలం ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మద్దయ్య కొడుకు మనోహర్(45) అప్పుడప్పుడు ఆలయ కోనేరులో ఈతకొట్టి స్వామివారిని దర్శించుకుని వెళ్తుండేవారు. ఈక్రమంలో గురువారం కోనేరులో ఈత కొడుతుండగా ఆయాసం రావడంతో గట్టుకు వచ్చి కూర్చున్న మనోహర్ కూర్చున్నట్లుగానే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.

Similar News

News November 14, 2025

రాబోయే పండుగలకు భద్రత చాలా ముఖ్యం: కలెక్టర్

image

రాబోయే పండుగల సమయంలో దేవాలయాలు, ప్రజా ప్రదేశాలలో పూర్తి భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గురువారం అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి పెట్రోల్ బంక్‌లు, థియేటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రజా భద్రతను నిర్ధారించడానికి లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆయన అధికారులకు సూచించారు.

News November 14, 2025

కౌంటింగ్ షురూ..

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్‌లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

News November 14, 2025

ఈనెల 17న జాబ్ మేళా

image

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.