News November 14, 2025
కోనసీమ: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జైలుశిక్ష పడింది. కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా వివరాల మేరకు.. అయినవిల్లి లంకకు చెందిన ముత్తబత్తుల సతీశ్ 2018 ఆగస్ట్ 7న 15 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది. నేరం నిరూపణ కావడంతో సతీశ్కు 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు జడ్జి K.శ్రీదేవి తీర్పు చెప్పారు.
Similar News
News November 14, 2025
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

AP: భవిష్యత్ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేశారు.
News November 14, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
News November 14, 2025
కాంగ్రెస్కు కొత్త నిర్వచనం చెప్పిన PM మోదీ

ఇప్పుడున్న కాంగ్రెస్ MMCగా మారిందని బిహార్ విక్టరీ సెలబ్రేషన్స్లో ప్రధాని మోదీ విమర్శించారు. ‘MMC అంటే ముస్లింలీగ్ మావోవాది కాంగ్రెస్. ఇతర పార్టీల ఓట్లతో బతకాలని కాంగ్రెస్ చూస్తోంది. ఎన్నికలు వస్తే వేరే పార్టీలనూ ముంచేస్తోంది. ప్రజలకు ఆ పార్టీపై క్రమంగా విశ్వాసం పోతోంది’ అని వ్యాఖ్యానించారు. ఇక బిహార్లో ఆర్జేడీ MY(ముస్లిం, యాదవ్) ఫార్ములాను నమ్మితే తాము MY(మహిళా, యూత్)ను నమ్మినట్లు చెప్పారు.


