News November 14, 2025
గుంటూరు డివిజన్ మీదుగా స్పెషల్ ట్రైన్స్

గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ తాత్కాలికంగా నడుపుతోంది. సికింద్రాబాద్-కాకినాడ రూట్పై నడిచే 07619 రైలు నవంబర్ 16వ తేదీన నడికుడి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తుందని తెలిపారు. బెంగళూరు-భాగల్పూర్ (06565) రైలు నవంబర్ 15న విజయవాడ డివిజన్ మీదుగా నడుస్తుందని, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ మీదుగా నడుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News November 14, 2025
స్వచ్ఛతా అవార్డు అందుకున్న సింగరేణి C&MD

కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరాం అత్యుత్తమ స్వచ్ఛతా కంపెనీ అవార్డును అందుకున్నారు. సంస్థ అధికారులు, ఉద్యోగులను C&MD ఈ సందర్భంగా అభినందించారు.
News November 14, 2025
‘కాంత’ సినిమా రివ్యూ&రేటింగ్

ఓ దర్శకుడు, హీరోకి మధ్య విభేదాలతో పాటు ఓ హత్య చుట్టూ జరిగే కథే ‘కాంత’. 1950 కాలం నాటి సినీ లోకాన్ని స్క్రీన్పై చూపించారు. సెట్స్, కార్లు, కెమెరాలు, లొకేషన్స్, గెటప్లు కొంత మేరకు ఆకట్టుకుంటాయి. మహానటి సినిమాను గుర్తుచేస్తాయి. దుల్కర్, సముద్రఖని, రానా నటన మెప్పిస్తుంది. సాగదీతగా సాగే స్క్రీన్ప్లే, స్టోరీకి కనెక్ట్ కాకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో బోరింగ్గా అనిపిస్తుంది. రేటింగ్: 2.5/5.
News November 14, 2025
నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్, ఎస్పీ నివాళి..

దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘన నివాళులర్పించారు. బాలల హక్కుల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని SP హామీ ఇచ్చారు.


