News November 12, 2025
గోదావరిఖని: బాంబు పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్

ఢీల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనరేట్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. మంగళవారం రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షేట్టిపేట, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. నాగబంది నిర్వహించి, వాహనాల తనిఖీలు చేపట్టారు.
Similar News
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్రాజ్ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
News November 12, 2025
HYD: సీఐడీ విచారణకు సినీ నటులు

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ విచారణ వేగం పెంచింది. నిన్న నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన అధికారులు, నేడు నటుడు ప్రకాశ్రాజ్ను విచారణకు పిలిపించారు. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రమోషన్ వివరాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. గత 10 రోజుల క్రితం సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు.
News November 12, 2025
బీజాపూర్ అడవుల్లో కాల్పుల మోత!

ఛత్తీస్గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతాల్లో రెండు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ మద్దేడ్ ఏరియా కమిటీ, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మద్దేడ్ ఏరియా కమిటీ ఇన్ఛార్జితో బుచ్చన్నతో పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు భార్య ఊర్మిళ మృతి చెందారు. ఈ విషయాన్ని బీజాపూర్ పోలీసులు ధ్రువీకరించారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.


