News November 12, 2025

చిన్నబొంకూర్‌లో ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. మ్యాచర్ వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు వరి కోతల అనంతరం ధాన్యాన్ని తగినంతగా ఆరబెట్టి సెంటర్లకు తీసుకురావాలని తెలిపారు. ఈ పరిశీలనలో డీసీఎస్ఓ, డిటిఓ పాల్గొన్నారు.

Similar News

News November 12, 2025

తొలి టెస్టులో పంత్, జురెల్ ఆడవచ్చేమో: డస్కాటే

image

ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టులో పంత్, జురెల్ ఇద్దరూ ఆడే అవకాశం ఉందని IND అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనన్నారు. ఇటీవల SA-Aతో జరిగిన అనధికార టెస్టులో జురెల్ <<18235138>>రెండు సెంచరీలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కీపర్లలో ఒకరిని బ్యాటర్‌గా ఆడించనున్నట్లు తెలుస్తోంది. అటు ఆల్‌రౌండర్ నితీశ్‌కు ఆడే అవకాశం రాకపోవచ్చని డస్కాటే పేర్కొన్నారు.

News November 12, 2025

పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

image

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఫిన్‌లాండ్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

News November 12, 2025

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

image

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణాల గురించి చర్చించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులు పాల్గొన్నారు.