News November 12, 2025
జల సంరక్షణలో జనగామకు రూ.కోటి నజరానా..!

జన భాగస్వామ్యంతో జల సంరక్షణలో అద్భుత ఫలితాలు సాధించినందుకు గాను జనగామ జిల్లాకు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ రూ.కోటి నజరానా ప్రకటించింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గతేడాది 2024 ఏప్రిల్ నుంచి 30,569 ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టినందుకు గాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈనెల 18న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా నజరానా అందుకోనున్నారు.
Similar News
News November 12, 2025
రెండో రోజు కొనసాగుతున్న సిట్ విచారణ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు సిట్ విచారిస్తోంది. ఉదయం 8.30 గంటలకు అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. మంగళవారం జరిగిన విచారణలో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి వాటిని అడిగే అవకాశం ఉంది.
News November 12, 2025
బ్యాంకుకు ‘లంచ్ బ్రేక్’ ఉంటుందా?

బ్యాంకు సర్వీస్లో లంచ్ బ్రేక్ ఉండదు. RBI ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్డ్ టైమ్ లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ మూసివేయకూడదు. లంచ్ సమయంలోనూ ఎవరో ఒకరు రొటేషనల్ పద్ధతిలో కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్ బ్రేక్ పేరుతో ఇబ్బంది పడితే RBI కస్టమర్ కేర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది. SHARE
News November 12, 2025
దర్శనాల నిలిపివేత పై మరికాసేపట్లో అధికారిక ప్రకటన

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం నిలిపివేయడంపై ఆలయ అధికారులు మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు. అభివృద్ధి పనుల కోసం నెల రోజుల కిందనే దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్ర వ్యతిరేకత తెలపడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం లేకుండా బుధవారం తెల్లవారుజాము నుండి దర్శనాలు నిలిపివేశారు.


