News November 14, 2025
జూబ్లీ బైపోల్: పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు 47 ఓట్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్లో భాగంగా షేక్పేట బూత్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
Similar News
News November 14, 2025
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 25,807 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,237 వద్ద కొనసాగుతున్నాయి. మెటల్, ఐటీ, ఆటో, FMCG స్టాక్స్ ఎరుపెక్కాయి. ముత్తూట్ ఫిన్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎయిర్టెల్, ఐటీసీ, ఇన్ఫీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
News November 14, 2025
నేను టీటీడీ ఉద్యోగిని కాను: రవి కుమార్

పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ, రవికుమార్ ఆస్తులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఏసీబీతో విచారణ చేయాలనే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రవికుమార్ వాజ్యం వేశారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరకామణి వ్యవహారంలో సుమోటో వ్యాజ్యంను మేమే విచారిస్తామని సీజే బెంచ్ తెలిపింది. అయితే నేను టీటీడీ ఉద్యోగిని కాను, నిర్వచనం పరిధిలోకి రాను, ఏసీబీ విచారణ ఆపాలని కోరారు.
News November 14, 2025
BRSకు స్వల్ప ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది.


