News November 12, 2025
జూబ్లీ బైపోల్.. ఫలితాలపై ఎవరి ధీమా వారిదే!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 48.49 శాతం పోలింగ్ నమోదు కాగా ఫలితాల్లో తమదే విజయమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు చెబుతున్నారు. పోల్ మేనేజ్మెంట్ పక్కాగా జరిగిందని, తామే గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సైలెంట్ ఓటింగ్తో తమదే గెలుపు అని BRS ధీమాగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అనంతరం కమలనాథులు సందిగ్ధంలో ఉన్నారు. గెలుపెవరిదో..?
Similar News
News November 12, 2025
జూబ్లీహిల్స్ EXIT POLLS.. BRS, కాంగ్రెస్ వార్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై BRS, కాంగ్రెస్ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్, HMR,నాగన్న, జనమైన్, స్మార్ట్ పోల్,ఆరా మస్తాన్ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని వెల్లడించగా మిషన్ చాణక్య, క్యూమెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ BRS గెలుస్తుందని చెప్పాయి. దీంతోNOV 14న దేఖ్లేంగే అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. మీ కామెంట్?
News November 12, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.
News November 12, 2025
జూబ్లీహిల్స్: ప్రచారం ఫుల్.. పోలింగ్ నిల్..!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండు వారాల పాటు ప్రధాన పార్టీలు ఫుల్ జోష్గా ప్రచారం చేశాయి. సీఎం సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల కీలక నేతల రోడ్ షోలు,ర్యాలీలు, డైలాగ్లు,మాటల తూటాలు, ఆరోపణలతో ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ వేడెక్కాయి. అయితే ఇంత చేసినా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో అటు పార్టీలతోపాటు ఇటు ఎన్నికల అధికారులు వెనకబడ్డారు. 48.49% పోలింగ్ జరిగింది.


