News December 3, 2025
డిజిటల్ సేవల విస్తరణపై కేంద్రం దృష్టి సారించాలి: ఎంపీ కావ్య

వరంగల్ పార్లమెంటు పరిధిలో డిజిటల్ సేవల విస్తరణపై కేంద్రం దృష్టి సారించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. డిజిటల్ సేవల విస్తరణపై పార్లమెంటులో ఎంపీ ప్రశ్నించారు. 5G సేవలు, పోస్టల్ సేవల డిజిటలీకరణ, డిజిటల్ సాక్షరత, సైబర్ భద్రతపై ఎంపీ వివరణ కోరారు. జిల్లాలో 5G సేవల విస్తరణ కోసం ఇప్పటి వరకు 209 బీటీఎస్ టవర్లు ఏర్పాటు చేసినట్లు కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
Similar News
News December 7, 2025
ములుగు: రెండో విడతలో 11 జీపీలు ఏకగ్రీవం

జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న 52 గ్రామ పంచాయతీల్లో 11 పంచాయతీ కార్యవర్గాలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. గుర్తూరు తండా, ముద్దునూరుతండా, అంకన్నగూడెం, బంజరుపల్లి, జగ్గన్నపేట, కొత్తూరు, పెగడపల్లి, రాయినిగూడెం, అడవి రంగాపురం, నర్సింగాపూర్, తిమ్మాపూర్ గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
News December 7, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.152 నుంచి రూ.168, మాంసం రూ.220 నుంచి 257 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.251 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు10 కోడిగుడ్ల ధర రూ. 90 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 7, 2025
అన్నింటికీ ఆధారం ‘విష్ణుమూర్తి’

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః॥
విష్ణుమూర్తికి పుట్టుక లేదు. ఆయనే అన్నింటికీ అధిపతి. ఏదైనా సాధించగలిగినవాడు. అన్నిటికంటే ముందుంటాడు. వానలు కురిపిస్తాడు. తిరిగి ఆ నీటిని స్వీకరిస్తాడు. ఆయన ఆత్మ అనంతం. కొలవడానికి వీలు కానిది. అన్ని లోకాల పరిణామం నుంచే ఈ సృష్టిని పుట్టించే శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన అన్నింటికీ ఆధారం. <<-se>>#VISHNUSAHSARANAMAM<<>>


