News November 1, 2025
తప్పెవరిది? మూల్యం చెల్లించేదెవరు?

AP: కర్నూలు బస్సు ప్రమాదం(19 మంది మృతి) మరువకముందే శ్రీకాకుళంలోని కాశీబుగ్గ తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ 2 ఘటనల్లోనూ నిర్వాహకుల నిర్లక్ష్యం సామాన్యులకు యమపాశంగా మారింది. తాజా దుర్ఘటనలో ఆలయం గురించి విపరీతమైన ప్రచారం, సౌకర్యాల లేమి 10 మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఎవరో చేసిన తప్పులకు మరెవరో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి బాధాకరం. ఇలాంటివి జరగకుండా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
Similar News
News November 2, 2025
NHIDCLలో 34 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(<
News November 2, 2025
దారుణం.. ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

TG: వికారాబాద్లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తె, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో కూతురుపైనా దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పరిగి డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
గేదెను కొనేటప్పుడు ఇవి తప్పక తెలుసుకోండి

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.


