News November 12, 2025
త్వరలో ఈ జిల్లాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం

తెలంగాణలో ఆయిల్ పామ్ ఉత్పత్తిని పెంచేలా త్వరలో పలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి. సిద్దిపేటలోని నర్మెట్టలో ఆయిల్ ఫెడ్, పెద్దపల్లిలో తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ, ఖమ్మంలో గోద్రెజ్ అగ్రోవెట్ ఫ్యాక్టరీ, వనపర్తిలో ప్రీ యూనిక్ ఫ్యాక్టరీ, ఖమ్మంలోని కల్లూరు గూడెంలో ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీ, గద్వాల్లోని బీచుపల్లిలో ఆయిల్ ఫెడ్, ములుగులో K.N.బయోసైన్సెస్ ఫ్యాక్టరీలు AUG-2026 నాటికి ప్రారంభంకానున్నాయి.
Similar News
News November 12, 2025
తొలి టెస్టులో పంత్, జురెల్ ఆడవచ్చేమో: డస్కాటే

ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టులో పంత్, జురెల్ ఇద్దరూ ఆడే అవకాశం ఉందని IND అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనన్నారు. ఇటీవల SA-Aతో జరిగిన అనధికార టెస్టులో జురెల్ <<18235138>>రెండు సెంచరీలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కీపర్లలో ఒకరిని బ్యాటర్గా ఆడించనున్నట్లు తెలుస్తోంది. అటు ఆల్రౌండర్ నితీశ్కు ఆడే అవకాశం రాకపోవచ్చని డస్కాటే పేర్కొన్నారు.
News November 12, 2025
పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
News November 12, 2025
టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్గా మారిన ధర్మారెడ్డి?

AP: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ EO ధర్మారెడ్డి అప్రూవర్గా మారినట్లు తెలుస్తోంది. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగినట్లు ఆయన అంగీకరించారని సమాచారం. CBI సిట్కు ఇచ్చిన వాంగ్మూలంలో ధర్మారెడ్డి కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది.


