News November 12, 2025

నేడు కర్నూలుకు గవర్నర్ రాక

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

Similar News

News November 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 64

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని గురువైన పరశురాముడు ఎలా గుర్తించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 12, 2025

టుడే..

image

* AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ
* కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
* TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ, రేపు <<18194401>>స్పీకర్<<>> విచారణ
* మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించనున్న మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, అడ్లూరి
* వేములవాడ ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత

News November 12, 2025

హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

image

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.