News November 14, 2025
పర్యాటకుల కోసం డ్రెస్ చేంజింగ్ రూమ్లకు శంకుస్థాపన

చీరాల మండలం రామాపురంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య శుక్రవారం పర్యటించారు. రామాపురం బీచ్ వద్ద పర్యాటకుల కోసం డ్రెస్ చేంజింగ్ రూములు, మరుగుదొడ్ల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చీరాల నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2025
పులివెందులలో వ్యక్తి దారుణ హత్య.?

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురంలో శుక్రవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గొర్ల వంశీకృష్ణ (30)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించాగా మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. వంశీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 14, 2025
సిరిసిల్ల జిల్లాలో 12,150 మంది మధుమేహ బాధితులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12,150 మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా వైద్యులు డయాబెటిస్ నివారణ చర్యలను సూచించారు. 3 నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకుని, వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుందని తెలిపారు. డయాబెటిస్ ఉందని భయపడాల్సిన అవసరం లేదని, ప్రతినిత్యం ఉదయం నడకతో పాటు, ఎక్సర్సైజ్ చేయాలని సూచించారు.
News November 14, 2025
సాక్షి మృతి.. అదే ఫార్ములా రిపీట్: TDP

TTD మాజీ AVSO సతీశ్ మృతిపై TDP చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘కేసులో సాక్షి గల్లంతైతే నేర నిరూపితం కష్టమే. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందనుకున్న టైంలో సాక్షి చచ్చిపోతాడు. పరిటాల రవి కేసు నుంచి పరకామణి కేసు వరకు అదే ఫార్ములా రిపీట్. నాడు బాబాయ్ వివేకానంద రెడ్డిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అని, నేడు మాజీ AVSOని చంపేసి బలవన్మరణం అని YCP ప్రచారం చేస్తోంది’ అని TDP ఆరోపించింది.


