News December 8, 2025
పాలమూరు: వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ పదవికి పోటీ

కొత్తకోట మండలం రామనంతపూర్లో మొత్తం 8 వార్డులున్నాయి. రెండో విడత నామినేషన్లో భాగంగా సర్పంచ్ పదవికి ఆరుగురు, వార్డు మెంబర్లకు 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవంగా చేసి, నిధులతో దేవాలయం నిర్మించాలని తీర్మానించగా, నలుగురు అభ్యర్థులు తప్పుకున్నారు. కానీ యాదగిరిరెడ్డి, శివుడు పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ఏకగ్రీవ చర్చలు విఫలమయ్యాయి. వార్డు మెంబర్లను మాత్రం ఏకగ్రీవం వరించింది.
Similar News
News December 9, 2025
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ASF SP

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ASF SP నితికా పంత్ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో 5 మండలాల్లో 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
News December 9, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: వరంగల్ సీపీ

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 11న జరిగే మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
VZM: జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం

ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం తాత్కాలిక న్యాయ సహాయ కేంద్రం ప్రారంభిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం తెలిపారు. ప్రజలకు న్యాయ సహాయం, మానవహక్కులపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా చూడడం, అవసరమైన సలహాలు అందించడం కార్యక్రమ లక్ష్యం అని చెప్పారు.


