News December 7, 2025
ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ సేవలన్నింటిని ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తీసుకురావాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలపై ఎంపీడీఓలతో కలెక్టర్ శనివారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్ని ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు. కౌశలంలో పంచాయతీ కార్యదర్శుల సేవలను ప్రశంసించారు.
Similar News
News December 7, 2025
బాపట్ల జిల్లాలో ఎంతమంది రౌడీషీటర్లు ఉన్నారంటే

జిల్లాలో మొత్తం 1,013 మంది రౌడీ షీటర్లు ఉన్నారని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నేరాలకు పాల్పడే వారికి పీడీ చట్టం ప్రయోగించడం, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా బోమన్నారు. ఇప్పటికే 32 మందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
News December 7, 2025
జ్యోతిషుడి సలహా.. బీబీనగర్ సర్పంచ్ బరిలో భార్యాభర్తలు

బీబీనగర్ సర్పంచ్ ఎన్నికల బరిలో నారగొని మహేష్ గౌడ్ తన భార్య శ్రీలతతో కలిసి పోటీకి దిగారు. జ్యోతిషుడి ఇచ్చిన సలహా మేరకు, భార్యాభర్తలు ఇద్దరూ బరిలో ఉంటే విజయం ఖాయమని భావించి, ఆయన శ్రీలతను నామినేషన్ వేయించారు. అధికారులు విడుదల చేసిన బ్యాలెట్ పత్రాల్లో ఇద్దరి పేర్లు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. విజయం ఎవరికి దక్కుతుందోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News December 7, 2025
నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్కుమార్(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.


