News September 18, 2025
బయోలాజికల్ కంట్రోల్ లాబరేటరీ పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

నిడదవోలులో వ్యవసాయ శాఖ నడుపుతున్న బయోలాజికల్ కంట్రోల్ లాబోరేటరీని బుధవారం జిల్లా వ్యవసాయా ధికారి ఎస్.మాధవరావు సందర్శించారు. లేబోరేటరీ ద్వారా రైతులకు జీవ నియంత్రణ కారాకాలైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమో నాస్ ఫ్లోరిసెన్స్ తదితర జీవ శిలీంద్ర నాశనాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. వీటి ద్వారా వరి, పొగాకు, అరటి, నిమ్మ కూరగాయలు పంటలకు వచ్చే పొడ తెగులు, కాండం, వేరు కుళ్లు నియంత్రించవచ్చునన్నారు.
Similar News
News September 18, 2025
రాజమండ్రి అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ అధికారులు హాజరయ్యారు. అభివృద్ధి పనులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన చర్చించారు.
News September 17, 2025
రాజమండ్రి : రాష్ట్ర సమాచార కేంద్రం ఏడీగా రామచంద్రరావు

ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఆర్.వి.ఎస్. రామచంద్రరావు పదోన్నతిపై రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మణా చార్యులు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇన్ఛార్జి సహాయ సంచాలకుడు రామచంద్రరావుకు సిబ్బంది ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు.
News September 17, 2025
రాజానగరం: డా.రెడ్డీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను పరిశీలించిన వీసీ

నన్నయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విద్యార్థులకు నిర్వహించిన డా.రెడ్డీస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ పరిశీలించారు. యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆచార్య బి. జగన్మోహన్ రెడ్డి, సంస్థ హెచ్.ఆర్ లక్ష్మీదుర్గలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశ్వవిద్యాలయం తరఫున ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని వీసీ కోరారు.