News November 12, 2025
రాష్ట్రంలో 78శాతం కరెంటు పరిగి నుంచే!

పరిగి పక్కన ఉన్న నాజీరాబాద్ విండ్ ఫామ్ రాష్ట్రంలోనే అతిపెద్ద గాలి కరెంటు ప్రాజెక్టు ఇది. రూ.600 కోట్లతో మైత్రా ఎనర్జీ సంస్థ దీన్ని కట్టింది. 48 మరలతో 100.8MW కరెంటు ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో గాలితో వచ్చే కరెంటులో 78% ఇక్కడి నుంచే వస్తుంది. 125 మీటర్ల ఎత్తులోని ఈ టవర్లు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు కీలకంగా మారాయి. ప్రభుత్వం పెట్టుకున్న 4,500 మోగా వాట్ల లక్ష్యానికి ఇదే ఆధారం.
Similar News
News November 12, 2025
రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.
News November 12, 2025
రంగారెడ్డి: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 13న ఇంటర్వ్యూ

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రంగారెడ్డి జిల్లా DMHO లలితాదేవి తెలిపారు. రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని, MBBS పూర్తి చేసిన వారు దరఖాస్తు ఫారంతో పాటు బయోడేటా, జిరాక్స్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్లు తీసుకురావాలన్నారు.
News November 12, 2025
HYD: శ్రీధర్రావు ఆక్రమణలను తప్పుబట్టిన హైకోర్టు

గచ్చిబౌలిలోని FCI ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఆక్రమణలను హైకోర్టు తప్పు పట్టింది. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణించింది. మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. అందుకే హైడ్రా ఆ ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది.


