News November 12, 2025

విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి: కలెక్టర్

image

నూతన విద్యా విధానం డిజిటల్ తరగతులు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా విద్యార్థులకు అవసరమైన విద్య బోధనలు, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. నెల్లికుదురు మండలంలోని కేజీబీవీనీ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టోర్ గది, టాయిలెట్స్, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ శానిటేషన్‌లపై అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 12, 2025

KMR: వైద్య వృత్తిలో సేవా భావంతో పనిచేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల MBBS మొదటి సంవత్సర 100 మంది విద్యార్థుల కోసం బుధవారం ‘వైట్ కోట్ సెరిమనీ’, కడవెరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య వృత్తిలో సేవాభావంతో పని చేయలన్నారు.

News November 12, 2025

అభివృద్ధి ప‌థంలో ప‌ర్యాట‌క రంగం కీల‌కం: కలెక్టర్

image

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సాకారానికి స‌మ్మిళిత‌, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్య‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశా అన్నారు. క‌లెక్ట‌ర్ బుధ‌వారం ట్రెయినీ ఐఏఎస్ అధికారుల‌తో క‌లిసి కొండ‌ప‌ల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్ర‌క వైభ‌వాన్ని వివ‌రించారు. కొండ‌ప‌ల్లి కోట‌ను ప‌ర్యాట‌కంగా మ‌రింత అభివృద్ధి చేసేందుకు చొర‌వ తీసుకుంటున్నామ‌ని వివరించారు.

News November 12, 2025

బుల్లెట్‌ బైక్‌పై సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ఈ నెల 13 నాటికి పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌, ఎస్పీ బుల్లెట్‌ బైక్‌పై వెళ్లి పనులను పరిశీలించారు. భక్తులకు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.