News November 2, 2025
విశాఖ: ఉద్యోగాల పేరిట మోసం

గాజువాకలో ఓ మహిళ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసింది. సత్యవతి తను న్యాయవాదినని జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీను, కొండబాబును నుంచి రూ.4,04,500 వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో వారు అడగ్గా.. నేను లాయర్ను నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేరంటూ ఎదురుతిరిగిందని బాధితులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవతిని ఆమె సహాయకులు అప్పలరమణ, సదాశిరావును శనివారం అరెస్ట్ చేశారు.
Similar News
News November 2, 2025
నో రిప్లై.. రేపటి నుంచి కాలేజీలు బంద్

TG: ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రేపటి నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేపట్టాలని యాజమాన్యాలు తాజాగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. రూ.900 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. ఈ నెల 4న మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తామని, 6న లక్ష మంది ప్రైవేటు కాలేజీల సిబ్బందితో సభ జరుపుతామని, 10న పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.
News November 2, 2025
భద్రాద్రి: మా రహదారి కష్టాలు తీర్చే నాధుడే లేరా?

చర్ల మండలం తిప్పాపురం నుంచి బత్తిన పెళ్లికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు కూడా గ్రామానికి రావడం మానేశారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్గా పెవిలియన్కు పంపింది.


