News November 14, 2025

విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

image

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగాలో రాధాకృష్ణన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణానికి ఉపరాష్ట్రపతి చేరుకొని సదస్సును ప్రారంభించనున్నారు.

Similar News

News November 14, 2025

ఆల్పాహార విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

image

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్‌.. సీఎం చంద్రబాబు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటుగవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఉన్నారు.

News November 14, 2025

విశాఖ: 2300 మందితో భద్రత

image

విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను, కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా సుమారు 2300 మంది(8 మంది ఐపీఎస్ అధికారులు, 8మంది ఏడీసీపీలు, 32 మంది ఏసీపీలు, 89 సీఐలు, 192 ఎస్.ఐలు, 2000(ఏ.ఎస్.ఐ,హెచ్.సి,పి.సి, హెచ్.జి)సిబ్బందితో సదస్సుకు పకడ్బందీగా భద్రతా భద్రతా ఏర్పాట్లు చేశారు.

News November 13, 2025

విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

విశాఖ వేదికగా నిర్వహించే సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖబ్రత బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసీ స్వాగతం పలికారు. అక్కడ నుంచి గవర్నర్ విడిది కేంద్రానికి వెళ్లారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు నగరానికి చేరుకున్నారు.