News December 8, 2025

విశాఖ-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎప్పుడు పూర్తవుతుందంటే?

image

విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ వే పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు 2026 DECకి పూర్తి కానున్నాయి. మొత్తం 597KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే AP,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య రహదారి కనెక్టివిటీ మెరుగపడి ప్రయాణ సమయం 7 గంటలు తగ్గుతుంది. దీంతో టూరిజం,పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు ఊతం లభించనుంది.

Similar News

News December 9, 2025

దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

image

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.

News December 9, 2025

బీచ్ రోడ్డులో నేవీ ఉద్యోగుల పరిశుభ్రత కార్యక్రమం

image

ఆర్‌కే బీచ్‌లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. INS డేగాకు చెందిన నేవీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 30 మంది నావికులు,10 మంది అధికారులు బీచ్‌ ప్రాంతంలో చెత్తను తొలగించారు. ఈ డ్రైవ్‌ను స్వచ్ఛత పఖ్వాడాలో భాగంగా చేపట్టినట్లు నేవీ అధికారులు తెలిపారు. తీర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

News December 9, 2025

స్థూల సేంద్రియ ఎరువుల ప్రత్యేక ఏమిటి?

image

స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని ఎక్కువ పరిమాణంలో వాడవలసి ఉంటుంది. వీటి వినియోగంతో నేలలో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, నీటి పారుదల, నేల ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ మెరుగుపడతాయి. ఉదాహరణ: పశువుల ఎరువు, కోళ్లు, మేకల విసర్జన పదార్థాల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు మొదలైనవి. ఇవి మన ఊళ్లలోనే దొరుకుతాయి. వాటిని వృథాగా వదిలేయకుండా పొలాల్లో వేస్తే మంచి ఫలితాలు వస్తాయి.