News November 14, 2025
విశాఖ: 400 MOUలు.. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. రూ.11,91,972 కోట్ల పెట్టుబడులతో 400 ఎంఓయూలు జరిగాయి. వీటి ద్వారా 13,32,445 ఉద్యోగాలు రానున్నాయని అధికార యంత్రాంగం తెలిపింది. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐఅండ్ఐ, పరిశ్రమలు-వాణిజ్యం, ఐటీ, మున్సిపల్ శాఖల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
Similar News
News November 15, 2025
లిక్కర్ స్కాం నిందితుడు అరెస్ట్.. విజయవాడకు తరలింపు

రాజస్థాన్లోని అజ్మీర్కు చెందిన అనిల్ చోకర్ను లిక్కర్ స్కాం కేసులో సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇతడిని 49వ నిందితుడిగా పేర్కొన్నారు. అనిల్ చోకర్ ముంబైలో సెల్ కంపెనీలు సృష్టించి, లిక్కర్ స్కాం ద్వారా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్గా మార్చాడని సిట్ అభియోగం మోపింది. నిందితుడిని నిన్న ముంబైలో అరెస్టు చేసి, స్థానిక ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు శుక్రవారం విజయవాడకు తరలించారు.
News November 15, 2025
ఇవి సర్ప్రైజ్ రిజల్ట్స్: రాహుల్ గాంధీ

బిహార్ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చర్యపరిచాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియలో మొదటి నుంచీ అన్యాయం జరిగిందని, అందుకే తాము విజయం సాధించలేకపోయామని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం చేస్తున్నట్లు వివరించారు. ఓటమిపై కాంగ్రెస్, ఇండియా కూటమి లోతుగా సమీక్షించుకుని, మరింత బలంగా తిరిగివస్తామని పేర్కొన్నారు.
News November 15, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

NLG : డీసీసీబీలో సహకార వారోత్సవాలు
మిర్యాలగూడ: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
NLG : చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి
NLG : వెటర్నరీ ఆసుపత్రిలో మందుల కొరత
NLG : చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు
NLG : 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
NLG : పోస్ట్ ఆఫీస్ పని వేళల్లో మార్పులు
NLG : యాసంగి ప్రణాళిక @ 6,57,229 ఎకరాలు
చిట్యాల : నల్లగొండ పోలీసుల సూపర్


