News November 19, 2025
విష్ణు సహస్ర నామాలు ఎలా ఏర్పడ్డాయి?

భీష్ముడు అంపశయ్యపై తొలిసారిగా విష్ణు సహస్ర నామాలను స్తుతించాడు. ఇవి విష్ణుమూర్తి గొప్పతనాన్ని, ఆయన 1000 పేర్లను సూచిస్తాయి. అయితే కృష్ణుడి సలహాతో సహదేవుడు ఆ నామాలను మళ్లీమళ్లీ వినిపించేలా చేశాడు. అదే సమయంలో వ్యాసుడు వాటిని రాశాడు. ఈ నామాలను పఠించినవారికి ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెరుగుతుందని, వారిని భక్తి మార్గాన పయణించేలా చేస్తుందని నమ్మకం. ఆ నామాలు, వాటి భావాలను Way2News రోజూ మీకు అందిస్తుంది.
Similar News
News December 7, 2025
NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (<
News December 7, 2025
అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.
News December 7, 2025
విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.


