News November 14, 2025
వీరుడు, సంఘసంస్కర్త పల్నాడు బ్రహ్మనాయుడు

11వ శతాబ్దంలోనే కుల మతాలకతీతంగా చాపకూటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన మాచర్ల మహామంత్రి పల్నాడు బ్రహ్మనాయుడు. ఆయన పాలనా, ధర్మ పోరాటం, సమానత్వ సాధనలో మార్గదర్శకుడు. మాల కన్నమదాసును దత్తత తీసుకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు. మాచర్ల, మార్కాపురం, కారంపూడిలో ఆయన కట్టించిన వైష్ణవాలయాలు నేటికీ ఉన్నాయి. యుద్ధంలో ఓడిపోయినప్పటికీ నాగమ్మను చంపకుండా వదిలివేసి యుద్ధ నీతిని చాటిచెప్పాడు.
Similar News
News November 14, 2025
కౌంటింగ్ షురూ..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. జూబ్లీహిల్స్లో 2, 3 గంటల్లో ఫలితాల సరళి తెలియనుంది. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది. అటు బిహార్లో 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
News November 14, 2025
ఈనెల 17న జాబ్ మేళా

AP: ఈనెల 17న పార్వతీపురం Employment Office ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నారు. 18ఏళ్లు పైబడిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం 1150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ముందుగా https://rb.gy/68z9mn లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
News November 14, 2025
భద్రాద్రి జిల్లాలో 45,681 మంది డయాబెటిస్ బాధితులు

భద్రాద్రి జిల్లాలో డయాబెటిస్ బాధితులు సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. జిల్లాలో వ్యాప్తంగా 5,19,760మందికి పరీక్షలు నిర్వహించగా 45,681 మందిని డయాబెటిస్ బాధితులుగా గుర్తించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 30శాతంపైగా డయాబెటిస్తో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ‘నేడు వరల్డ్ డయాబెటిస్ డే’


