News November 2, 2025
వేములవాడలో విద్యుత్ స్తంభాల తరలింపు

వేములవాడ పట్టణంలోని మెయిన్ రోడ్డులో విద్యుత్ స్తంభాల తరలింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన రోడ్డు వెడల్పుతో పాటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం విస్తరణ పనుల నేపథ్యంలో ఇంతకుముందు ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి అమరుస్తున్నారు. ఆలయం దక్షిణం వైపు పాత ఆంధ్రబ్యాంకు వద్ద ఆదివారం నాడు సెస్ సిబ్బంది స్తంభాలు తరలించే క్రమంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ట్రాఫిక్ ను మల్లించారు.
Similar News
News November 2, 2025
తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 2, 2025
కదిరిలో 30 మందిపై రౌడీ షీట్లు నమోదు

హత్య, హత్యాయత్నం, గంజాయి అమ్మకాలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులపై కదిరి టౌన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఆదేశాలతో 30మందిపై రౌడీషీట్లు నమోదు చేసినట్లు కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. తీవ్రమైన నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురిపై PD చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు చెప్పారు.
News November 2, 2025
డిప్యూటీ సీఎం పరిగి పర్యటన వాయిదా

పరిగి నియోజకవర్గంలో జరగాల్సిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన వాయిదా పడింది. ముందుగా సోమవారం జరగాల్సిన ఈ పర్యటన ఇప్పుడు బుధవారానికి జరుగనుంది. పరిగి పరిధిలో 400 KV, ఆరు 33/11 KV సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేసి, నజీరాబాద్ తండాలో 220 KV సబ్స్టేషన్ ప్రారంభించి, రూ.8 కోట్లు విలువైన వ్యవసాయ విద్యుత్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.


