News November 14, 2025
వేములవాడ రాజన్న దర్శనాలు.. UPDATE

వేములవాడ రాజన్న ఆలయంలో రెండు రోజుల క్రితం నుంచి దర్శనాలను నిలిపివేసిన అధికారులు భక్తులు ప్రవేశించకుండా ముందు భాగంలోని స్వాగత ద్వారం వద్ద రేకులను అమర్చిన విషయం తెలిసిందే. తాజాగా గేటు బయట నుంచి సైతం మరింత ఎత్తుగా అదనంగా రేకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గేటు ముందు రెండంచెల భద్రత తరహాలో ఇనుప రేకులను ఫిక్స్ చేశారు.
Similar News
News November 14, 2025
15వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన 15,589 ఓట్ల లీడ్లో ఉన్నారు. రౌండ్ రౌండ్కు ఆయన ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
News November 14, 2025
గుంటూరు మిర్చి యార్డులో ధరలో ఇలా.!

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 48,406 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 47,533 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 13,564 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.
News November 14, 2025
గుంటూరులో ఉగ్రవాద లింకులు?

గుంటూరులో ఉగ్ర లింకులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నిఘావర్గాల సమాచారంతో ముంబైకి చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు నిన్న ఉదయం నుంచి నగరంలో తనిఖీలు చేపడుతున్నట్లు పలు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. పట్టణంలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని, పలు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని గుంటూరు జిల్లా పోలీసు శాఖ పేర్కొంది.


