News November 1, 2025
సంగారెడ్డి: ఉద్యోగాల కౌన్సిలింగ్కు 24 మంది హాజరు

జిల్లా వైద్య శాఖలో తొమ్మిది రకాల ఉద్యోగాల కోసం నిర్వహించిన కౌన్సిలింగ్కు 24 మంది హాజరైనట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శనివారం తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ జరిగిందని చెప్పారు. కౌన్సిలింగ్కు ఉద్యోగులకు కేటాయించిన స్థానాలు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.
Similar News
News November 2, 2025
MDK: అడవిలో అందాల విడిది.. నర్సాపూర్ ఎకో పార్క్

చుట్టూ దట్టమైన అడవి, పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు. నీటిపై తేలియాడే కాటేజీలు, స్విమ్మింగ్ పూల్స్. కనువిందు చేసే ఈ సుందర దృశ్యలు మరెక్కడో కాదండోయ్ మన నర్సాపూర్లోనే. ఇక్కడి ఫారెస్టులో ఏర్పాటు చేసిన<<18172075>> ఎకో పార్క్<<>>ను రూ.3 కోట్లతో అభివృద్ధి చేసి శనివారం ప్రారంభించారు. ఇక్కడ ఆధునిక హంగులతో ఉన్న ఏర్పాట్లు ప్రకృతి ప్రేమికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. రాత్రంతా అక్కడే బస చేయవచ్చు.
-SHARE IT
News November 2, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలోనూ చికెన్ ధరలు తగ్గట్లేదు. హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.210-250, కామారెడ్డిలో రూ.260, ఉమ్మడి ఖమ్మంలో రూ.210-240, విజయవాడలో రూ.250, ఏలూరులో రూ.220, విశాఖలో రూ.260గా ఉన్నాయి. కార్తీక మాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి. మీ ఏరియాలో రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.
News November 2, 2025
GDWL: ఆహారం విషయంలో అలసత్వం వద్దు: జాయింట్ కలెక్టర్

విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, ఆహారం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నరసింగరావు హెచ్చరించారు. కాగా, ఎర్రవల్లిలో ఎస్సీ బాలుర గురుకులంలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో పలువురు విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వ్యవహరించాలని పాఠశాల సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.


