News November 1, 2025

సిద్దిపేట: రైతులకు ఆదుకుంటాం: మంత్రి

image

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎవరూ అధైర్య పడరాదని మంత్రిం పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్టోబర్ 29న ఇంతకుముందెన్నడూ లేని విధంగా జిల్లాలో కురిసిన వర్షానికి ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని అన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

Similar News

News November 2, 2025

నిజాంపేట: ఇదేనేమో నేటి టెక్నాలజీ..!

image

రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ ప్రభావం గ్రామాల్లో జరిగే సంప్రదాయ విక్రయాల్లోనూ కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో తిరుగుతూ కూరగాయలు, వివిధ వస్తువులు అమ్మేవారిని చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా నిజాంపేటలో గాడిది పాలు అమ్మే ఓ వ్యక్తి మైక్‌లో ‘గాడిద పాలు’ అంటూ ప్రకటన చేస్తూ విక్రయిస్తున్నారు. మైక్ శబ్దం విని అతడిని చూసిన స్థానికులు..’ఇదేనేమో నేటి టెక్నాలజీ’ అంటూ చర్చించుకుంటున్నారు.

News November 2, 2025

కాంగ్రెస్ కార్యాలయాన్ని BRSగా మార్చడమే ఆందోళనకు కారణమా..?

image

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు 2018లో గెలిచారు. ఆ తరువాత BRSలో చేరి అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ కార్యాలయ వివాదం తెర మీదికి వచ్చింది. దీంతో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌కి నిప్పు పెట్టారు. అనంతరం కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News November 2, 2025

‘ఇందిరమ్మ భవనం’గా బీఆర్ఎస్ కార్యాలయం

image

మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పు పెట్టిన విషయం విధితమే. పూర్వ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ గా మార్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదివారం కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అనంతరం తెలంగాణ భవన్ ను స్వాధీనం చేసుకుని ఇందిరమ్మ భవనంగా నామకరణం చేస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ జండాలు తొలగించి కాంగ్రెస్ జెండాలు ఆవిష్కరించారు.