News February 27, 2025

సిరిసిల్ల: పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 363,364 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని,183 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా సందర్శించారు. టీచర్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకునేందుకు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది.కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News February 27, 2025

EAPCET ప్రవేశాల్లో సవరణలు

image

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <>సవరణలు <<>>చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు కేటాయించనుంది. 15% అన్‌రిజర్వ్‌డ్ కోటా సీట్లకు 4 రకాలుగా అర్హులను గుర్తించింది. తెలంగాణ స్థానికులు, TGలో పదేళ్లు చదివిన ఇతర రాష్ట్రాల వారు, కేంద్ర-రాష్ట్ర సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలు, కేంద్ర-రాష్ట్ర ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఈ 15% సీట్లకూ అర్హులని పేర్కొంది.

News February 27, 2025

NZB జిల్లాలో ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?

image

నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా పోలింగ్ ముగిసే సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 76.78 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 92.46 శాతం పోలింగ్ నమోదయ్యింది.

News February 27, 2025

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్

image

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది మంది ఓటర్లకు గాను 2,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,702 మందికి గాను 1,619, మహిళలు 962 మందికి గాను 911 మంది ఓటు వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్ నమోదయింది.

error: Content is protected !!