News March 16, 2025

10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం: DEO

image

10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో 135 కేంద్రాల్లో 32,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని సూచించారు.

Similar News

News February 12, 2026

ATP: ఉత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష

image

అనంతపురం జిల్లాలో బ్రహ్మోత్సవాలు, జాతరలు, శివరాత్రి పర్వదినాల సందర్భంగా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ సెక్యూరిటీ ఆడిట్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

News February 12, 2026

రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.

News February 12, 2026

రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

image

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.