News November 6, 2025

10వ తేదీ జోగులాంబ ఆలయంలో కార్తీక సంబరాలు

image

ఈనెల 10వ తేదీ అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – పరంపర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక సంబరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరపత్రికను విడుదల చేసింది. ఆలయాల వైభవం ఆధ్యాత్మిక సనాతన సంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు ఉట్టిపడేటువంటి అనేక కార్యక్రమాలు ఈ సంబరాలు చోటుచేసుకొనున్నాయి.

Similar News

News January 15, 2026

VZM: చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

image

వేపాడ మండలం బొద్దాం నుంచి రామస్వామిపేట వేళ్లే తారు రోడ్డులో బొద్దాం రైల్వే గేట్ సమీపంలో నర్సిపల్లి మెట్టకు చెందిన అన్నదమ్ములు బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపు రామదాసు (26) సంఘటన స్థలంలో చనిపోగా గోపు రామచంద్ర (28)అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అంబులెన్స్‌లో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 15, 2026

APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 15, 2026

తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

image

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.