News November 30, 2025
100 మీటర్ల దూరంలో ఆంక్షలు: ఎస్పీ నరసింహ

రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మునగాల మండలంలోని రేపాలలోని నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ నరసింహ ఆదివారం పరిశీలించారు. ఎన్నికలకు ఐదు అంచెల పోలీసు భద్రత ఉండాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు చేయాలని, అనుమతులు ఉన్న వ్యక్తులను మాత్రమే లోపలికి పంపించాలని ఆయన సూచించారు.
Similar News
News February 16, 2026
MBNR: మధ్య తరగతి కుటుంబం నుంచి మేయర్ దాకా!

మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మూడో డివిజన్ అప్పన్నపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుమాల్ మమత శీను ముదిరాజ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్ తొలి మహిళ మేయర్గా మమత ఎన్నిక కావడం విశేషం. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి మేయర్గా ఎన్నిక కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 16, 2026
కృష్ణా: తండ్రికి ఆసరాగా వెళ్తూ.. అనంత లోకాలకు!

తండ్రికి ఆసరాగా ఉండాలనుకున్న ఆ యువకుడిని జలరూపంలో మృత్యువు కబళించింది. పోరంకికి చెందిన డిగ్రీ విద్యార్థి సత్యనారాయణ, ఆదివారం సెలవు కావడంతో తండ్రితో కలిసి కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నదిలో గల్లంతై మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News February 16, 2026
MBNR: మంత్రి శ్రీహరి ఇలాకా.. ఏకగ్రీవ ఎన్నిక

మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గమైన మక్తల్లోని 3 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లుగా కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
✒మక్తల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస, వైస్ ఛైర్ పర్సన్ శైవీ రెడ్డి
✒ఆత్మకూరు ఛైర్ పర్సన్ నాగమణి, వైస్ ఛైర్ పర్సన్గా శ్రీనివాసులు
✒అమరచింత ఛైర్పర్సన్ జింక సువర్ణ, వైస్ ఛైర్పర్సన్గా రాధ


