News December 1, 2025

‘108’ సంఖ్య విశిష్టత

image

ధర్మశాస్త్రాల ప్రకారం.. మానవుడి శరీరంలో 108 ముఖ్యమైన నరాలు, మెదడులో 108 శక్తి కేంద్రాలు ఉన్నాయని చెబుతారు. వీటన్నింటినీ ఉత్తేజితం చేయడానికి ఓ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలని సూచిస్తారు. ఇలా చేస్తే మంత్రంలోని శక్తి ఈ కేంద్రాలన్నింటికీ ప్రసరించి, సంపూర్ణ ఆధ్యాత్మిక ఫలం వస్తుందని నమ్మకం. పగడాల మాలతో జపం చేస్తే.. వేయింతల ఫలం, రత్నమాలతో చేస్తే పదివేల రెట్ల ఫలం వస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి.

Similar News

News February 7, 2026

రేపు సూర్యుడిని ఎందుకు పూజించాలి?

image

రేపు భాను సప్తమి. దీన్నే ‘ఆరోగ్య సప్తమి’ అని కూడా అంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తొలగిపోయి, శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతారు. సూర్యరశ్మిలోని శక్తి మన శారీరక, మానసిక అనారోగ్యాలను నయం చేస్తుంది. నిష్ఠతో ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించే వారికి గత జన్మల పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా, ఏడాది పొడవునా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా దైవిక రక్షణ లభిస్తుంది.

News February 7, 2026

వాకింగ్‌కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

image

✦ జిమ్/లాంగ్ వాక్‌కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్‌స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్‌కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్‌సైజ్ చేసినట్టే.

News February 7, 2026

దివ్యాంగులకు వెసులుబాటు కల్పించిన UPSC

image

సివిల్స్ ఎగ్జామ్స్ రాసే దివ్యాంగుల(Pwbd)కు పరీక్షా కేంద్రం ఎంపికలో <<19061199>>UPSC<<>> వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులు కోరుకున్న కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్ స్ట్రెంత్) చేరుకున్నప్పటికీ దివ్యాంగ అభ్యర్థులకు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనుంది. అవసరమైన చోట పరీక్షా కేంద్రం సామర్థ్యాన్ని పెంచుతామని UPSC తెలిపింది. అయితే ఇది ఇతరులకు వర్తించదని స్పష్టం చేసింది.