News April 21, 2024
ఏడాదిలో రూ.1,161 కోట్లు.. 1,031 కేజీల బంగారం

AP: వడ్డీ కాసుల వాడి ఖజానా ఏటేటా పెరుగుతోంది. 2023-24లో భక్తులు సమర్పించుకున్న రూ.1,161 కోట్ల నగదు, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. దీంతో శ్రీవారి నగదు డిపాజిట్లు రూ.18వేల కోట్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వ 11,329 కేజీలకు చేరింది. ఈ మొత్తానికి ఏటా రూ.1,200 కోట్ల వడ్డీ వస్తోంది. అలాగే శ్రీవాణి ట్రస్టుకు నాలుగేళ్లలో రూ.1,200 కోట్ల విరాళాలు వచ్చాయి.
Similar News
News December 8, 2025
చంద్రుడిపై చివరి అడుగుకు 53 ఏళ్లు

US ‘అపోలో-11’ మిషన్ ద్వారా 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు మిషన్లలో 12మంది ‘మామ’ను కలిసి వచ్చారు. జాబిలిపై మనిషి చివరిసారిగా కాలుమోపి 53ఏళ్లవుతోంది. 1972 DEC 7-19 మధ్య అపోలో-17 ద్వారా యూజీన్, హారిసన్ మూన్పై దిగారు. 75గంటలు గడిపి రోవర్పై 35KM ప్రయాణించారు. 110KGల రాళ్లు, మట్టిని తీసుకొచ్చారు. వాటి ద్వారా అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉండేదని గుర్తించారు.
News December 8, 2025
BREAKING: సెలవుల జాబితా విడుదల

TG: 2026కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకుల సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను కేటాయించింది. బ్యాంకులకు 23 సెలవులను ఇచ్చింది. హాలిడేస్ లిస్టు కోసం పైన ఫొటోను స్లైడ్ చేసి చూడండి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా <<18470577>>సెలవుల జాబితాను<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.


