News June 18, 2024

12వ PRC కమిషనర్ మన్మోహన్ రాజీనామా

image

AP: రాష్ట్రంలో 12వ వేతన సవరణ సంఘం(PRC) కమిషనర్ మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తనను రిలీవ్ చేయాలంటూ సీఎస్ నీరభ్ కుమార్‌కు లేఖను పంపారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఈయనను ప్రభుత్వం 2023 జులైలో పీఆర్సీ కమిషనర్‌గా నియమించింది.

Similar News

News January 22, 2026

ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

image

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.

News January 22, 2026

ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

image

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?

News January 22, 2026

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

image

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.