News November 12, 2025

15న తిరుపతిలో జాబ్ మేళా

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌(MCC)లో 15వ తేదీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 3కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని కార్యాలయ అధికారి శ్రీనివాసులు చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, MBA పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు రావలని కోరారు.

Similar News

News November 12, 2025

VKB: స్కూల్‌లో విద్యార్థికి విద్యుత్ షాక్

image

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 12, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 2

image

9. మానవులు మానవత్వముని ఎట్లు పొందుతారు? (జ.అధ్యయనం వలన), 10. మానవునికి సాధుత్వాలు ఎలా సంభవిస్తాయి? (జ. తపస్సుతో సాధుత్వం, శిష్టాచార భ్రష్టతవంతో అసాధుభావం సంభవిస్తాయి.)
11. మానవుడు మనుష్యుడెలా అవుతాడు? (జ.మృత్యు భయము వలన)
12. జీవన్మృతుడెవరు? (జ.దేవతలకు, అతిధులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 12, 2025

MBNR: చెస్ ఎంపికలకు 250 మంది క్రీడాకారుల హాజరు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలు నిర్వహించారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన వారిని త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడా పోటీలకు పంపిస్తామని తెలిపారు. పీడీలు రామ్, వేణుగోపాల్ పాల్గొన్నారు.