News May 15, 2024

15 నుంచి 26 వరకు ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రద్దు

image

దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ డివిజన్‌లో భద్రతా చర్యల దృష్ట్యా ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు విశాఖపట్నం – విజయవాడ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22701) ను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. విజయవాడ – విశాఖ మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22702) ను కూడా పై తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.

Similar News

News December 14, 2025

విశాఖ: ఆర్టీసీలో నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు

image

ఆర్టీసీలో నెలరోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 20 నుంచి జనవరి 19వ తేదీ వరకు 48 గంటల్లోనే కస్టమర్లకు పార్సెల్ డెలివరీ చేస్తామన్నారు. విశాఖలో 84 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తక్కువ రేట్లకే కస్టమర్ వద్దకు పార్సెల్స్ చేరుతాయని, ఆర్టీసీకి అదనంగా ఆదాయం చేకూర్చే విధంగా సిబ్బందితో కార్గోపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News December 14, 2025

ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో నాగబాబు ప్రత్యేక భేటీ

image

ఉత్తరాంధ్ర జనసేన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎచ్చెర్లలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా చేపట్టే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు.

News December 14, 2025

విశాఖ ఉక్కు పరిశ్రమలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ CMD వల్లే నష్టాల బారిన పడుతోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. క్వాలిటీ లేని ఉక్కు తయారీ, అక్రమాలపై CBI విచారణ చేయాలని ఫిర్యాదు చేశాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. పదవీకాలం ముగుస్తున్న CMDని కొనసాగించవద్దని MLAలు CMకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రైవేటీకరణ విషయం వెనక్కి తగ్గడం లేదు. ప్లాంట్ ఆపరేషన్ విభాగం ప్రైవేటికరణకు టెండర్లను ఆహ్వానించింది.