News September 12, 2025

15 రోజుల్లో 214 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్

image

రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్‌ షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో పోకిరీలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గత నెల 16 నుంచి 31 వరకు వచ్చిన 228 ఫిర్యాదుల మేరకు 214 మందిని (మేజర్స్‌ 94, మైనర్స్‌ 120) పట్టుకున్నారు. వీరందరికి ఎల్బీనగర్‌ CP క్యాంప్‌ ఆఫీసులో కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ చేపట్టారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక బృందాలు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నాయన్నారు.

Similar News

News December 7, 2025

VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

image

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్‌కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News December 7, 2025

కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

image

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.

News December 7, 2025

GP ఎన్నికలపై “బండి” ఫోకస్

image

GP ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవడానికి కేంద్రమంత్రి బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మొదటి విడత నామినేషన్లు వేసిన సర్పంచ్ అభ్యర్థులతో వర్చువల్‌గా మాట్లాడుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు మండలానికి ఒక అబ్జర్వర్ నియమించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నుండి ఎలాంటి సహకారమైన అందిస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. విజయావకాశాలున్న జీపీలకు కరీంనగర్ నుంచి ప్రత్యేక టీంను పంపిస్తున్నారు.