News December 30, 2024
2024@ ఉమ్మడి తూ.గోలో పొలిటికల్ పిక్చర్ ఛేంజ్
ఉమ్మడి తూ.గో జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019లో 19 నియోజకవర్గాల్లో YCP 14, TDP 4, జనసేన ఒక స్థానంలో నెగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లతో పాటు మొత్తం 19 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇక్కడి నుంచి గెలిచిన పవన్ డిప్యూటీ సీఎం కావడం విశేషం.
Similar News
News January 26, 2025
సీతానగరం: పేలిన గ్యాస్ సిలిండర్.. అగ్ని ప్రమాదం
సీతానగరం మండలం రఘుదేవపురంలో ఆదివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా తునా తునకులు అయింది. కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
News January 26, 2025
రాజమండ్రిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య- ఎస్సై
రాజమండ్రి పనసచెట్టు సెంటర్ ప్రాంతానికి చెందిన సాలా బాల పరమేశ్వరి(35) ఆర్థిక ఇబ్బందులతో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. మృతదేహాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డెడ్బాడీని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
News January 26, 2025
కడియం: నర్సరీ మొక్కలతో జాతీయ జెండా
76వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపుతూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు కూర్పుతో రిపబ్లిక్ డే సందేశాన్ని శనివారం రైతులు ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా, ఎర్రకోట, ఆకృతులతో, రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, వినయ్లు సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ 76 వవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.