News November 6, 2025

22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జేసీ

image

జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.

Similar News

News January 22, 2026

మదనపల్లి బస్టాండులో పెద్దమండెం వ్యక్తి మృతి..!

image

మదనపల్లి ఆర్టీసీ బస్టాండులో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించింది. 2-టౌన్ SI రహీముల్లా, ఏఎస్ఐ రమణలు సీఐ ఆదేశాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పెద్దమండెం మండలం వెలిగల్లు కాలానీకి చెందిన శంకరప్ప కొడుకు<<18916147>> మారుతీగా గుర్తించారు.<<>> మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని ఏఎస్ఐ రమణ తెలిపారు.

News January 21, 2026

ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,760
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,499
* వెండి 10 గ్రాముల ధర: రూ.3250

News January 21, 2026

కడప: పోలీసుల నిర్ణయాలు ఆచరణలోకి రావా.!

image

రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు నో హెల్మెట్ – నో పెట్రోల్ అంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అంతే కాకుండా ఇటీవల రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ బైక్ ర్యాలీలు చేపడుతున్నారు. వీరు మాత్రం హెల్మెట్ పెట్టుకొని ర్యాలీలు చేస్తుంటే.. పలు రాజకీయ, ప్రజా, కుల, మత సంఘాల నాయకులు హెల్మెట్ లేకుండా ర్యాలీలు చేస్తున్నారు. ఇలా ఉంటే అనుకున్న ఫలితాలు ఎలా వస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.